News

బాబు కొత్తగా చేసిందేముంది


వైఎస్ హయాంలోనే రాయలసీమ ప్రాజెక్టులు 80 శాతం పూర్తి అయ్యాయని, చంద్రబాబు 20 శాతం పనులను పూర్తి చెయ్యలేకపోయారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దుయ్యబట్టారు. అన్నీ తానే చేశానని చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రెయిన్‌గన్ల టెక్నాలజీని వైఎస్సే తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబు కొత్తగా చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని, అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.